మన ప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి:
బీబీనగర్ మండల పరిధిలోని జియాపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మి నారాయణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా జరిగిన ముగ్గుల పోటీలో విజేతలుగా గెలుపొందిన వారికీ బీబీనగర్ మాజీ ఎంపీపీ,మాజీ జెడ్పిటిసి గోలి ప్రణిత పింగల్ రెడ్డి బహుమతులు అందజేసారు.ఈ కార్యక్రమంలో జియాపల్లి మాజీ ఎంపీటీసీ మన్నే బాలరాజు,బీబీనగర్ వార్డ్ సభ్యులు పిట్టల శ్యామల,జియా పల్లి కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షులు ఎండీ అన్వార్ బెగ్,7వ వార్డ్ సభ్యులు మన్నే రఘునాకర్,యూత్ అధ్యక్షులు సాయినాథ్ గౌడ్ మరియు గ్రామ మహిళలు యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

