మన ప్రగతి న్యూస్/మిర్యాలగూడ
మిర్యాలగూడ పట్టణంలోని 44వ వార్డు సీతారాంపురంలో భారత రాష్ట్ర సమితి పార్టీ నూతన వార్డు కార్యాలయం ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన యువనేత సిద్ధార్థ రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రారంభించారు. కార్యాలయ ప్రారంభోత్సవం అనంతరం 44వ వార్డుకు చెందిన జిల్లెపల్లి వాసు, లత గార్లతో సహా సుమారు 30 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. పార్టీలో చేరిన వారందరికీ యువనేత సిద్ధార్థ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా సిద్ధార్థ మాట్లాడుతూ.. వార్డు ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఈ కార్యాలయం వారధిగా నిలుస్తుందని పేర్కొన్నారు. పార్టీ బలోపేతానికి ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు చౌగాని బిక్షం గౌడ్, మాందన్ హనుమాన్ సింగ్, కళావతి, జంజిరాల నాగరాజు, ఎం.డి షోయబ్, సుంకు మధు, రాధ, రాము, సైదులు, ప్రశాంత్, నరసింహ, యాదమ్మ, కల్పనా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు


