Breaking News

భీమారంలో విషాదం..- చెట్టుకు ఉరివేసుకొని వ్యక్తి మృతి..- శోకసంద్రంలో కుటుంబ సభ్యులు..మన ప్రగతి న్యూస్/మంచిర్యాల జిల్లా ప్రతినిధి:అనారోగ్యంతో చెట్టుకు ఉరివేసుకొని, వ్య క్తి మృతి చెందిన ఘటనతో వారి కుటుం బంలో విషాద ఛాయలు అలుమున్నా యి. స్థానికుల సమాచారం మేరకు.. మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం భీమారం గ్రామంలో విషాదం చోటు చే సుకుంది. గ్రామానికి చెందిన బండి రమే ష్ ( 47 ) కు గత కొంతకాలంగా తీవ్రమైన అనారోగ్యం మరియు ఆర్థిక ఇబ్బందుల తో మానసికంగా కుంగిపోయి, బాధను తట్టుకోలేక శనివారం తెల్లవారుజామున గ్రామ చివర్లోని ఉన్న చెట్టుకు ఉరివేసుకొ ని మృతి చెందాడు. మృతుడు రమేష్ కు భార్య మంజుల, కుమార్తె పావని (20), కుమారుడు లక్ష్మీనారాయణ (16) ఉ న్నారు. కుటుంబ పోషణ భారం మొత్తం ఆయన పైనే ఉండడంతో, అనారోగ్యం కారణంగా పని చేయలేక పోవడం, దాని కి తోడు అప్పులు ఈ రెండు కలిసి అత న్ని తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. ఇంత చి న్న వయసులోనే తండ్రిని కోల్పోయిన పిల్లల పరిస్థితి, భర్తను కోల్పోయిన భా ర్య మంజుల దుఃఖం వర్ణనాతీతంగా మా రింది. విషయం తెలుసుకున్న గ్రామస్తు లు, బంధువులు రమేష్ ఇంటికి చేరుకు ని కుటుంబ సభ్యులను ఓదార్చి, పరామ ర్శించారు. ఇలాంటి సమయంలో కుటుం బానికి అందరి అండ అవసరం. స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు కుటుం బానికి చేయూత నివ్వాలని గ్రామస్తులు కోరుతున్నారు.

అడవి ప్రాంతంలో గంజాయి సాగు – డ్రోన్ సాయంతో ధ్వంసం

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అల్లూరి సీతారామరాజు జిల్లాలో గంజాయి పంటలను సాగుచేసే వారిపై పోలీసులు గట్టి నిఘా ఉంచారు. ఇటీవల జి.మాడుగుల మండలంలోని సొలభం పంచాయతీలో ఉన్న డేగలరాయి అటవీ ప్రాంతంలో 5 ఎకరాల్లో గంజాయి...

 సౌమ్య ప్రదోష వ్రతం – శివారాధనలో ప్రదోష పూజ విశిష్టత

సౌమ్య ప్రదోషం అంటే ఏమిటి? హిందూ ధర్మంలో ప్రదోషం శివుని పూజకు ప్రాధాన్యమున్న సమయంగా భావించబడుతుంది. సౌమ్య ప్రదోషం అనేది బుధవారాన త్రయోదశి తిథి ప్రదోష కాలంతో కలిసినప్పుడు ఏర్పడుతుంది. బుధవారాన్ని సౌమ్య వారంగా...