తెలుగు విశ్వవిద్యాలయం కు పాల్కురికి సోమనాథుని
పేరు పెట్టాలి
సాహితీ కళా స్రవంతి అధ్యక్షుడు సబ్బని లక్ష్మినారాయణ
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:
మహాకవులు పాల్కురికి సోమనాథుడు ,బమ్మెర పోతన లు పుట్టిన జన్మస్థలాలు దర్శనీయ స్థలాలుగా మారనున్నాయని కరీంనగర్ కు చెందిన ప్రఖ్యాత కవి, శరత్ సాహితీ కళా స్రవంతి అధ్యక్షుడు సబ్బని లక్ష్మినారాయణ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన పాలకుర్తి సోమేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పాల్కురికి సోమనాథుని స్మృతి వనం, బమ్మెర పోతనామాత్యుని సమాధి, గూడూరు శాసనాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు విశ్వవిద్యాలయంకు తెలంగాణ ఆదికవి, తొలి తెలుగు స్వతంత్ర కవి పాల్కురికి సోమనాథుని పేరు పెట్టాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.ఆయన వెంట సోమనాథ కళా పీఠం బాధ్యులు రాపోలు సత్యనారాయణ, ఉన్నారు.
