_ పోస్టర్ ఆవిష్కరించారు
మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల :ముస్తాబాద్ మండల కేంద్రంలో మండల ఆశా వర్కర్లు రాష్ట్రవ్యాప్తంగా ఆశా వర్కర్ల బస్సు జాతాను విజయవంతం చేయాలని మండల కేంద్రంలో రాజీవ్ చౌకు వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈనెల 15 నుంచి 31 వరకు రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బస్సు జతాన్ చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆశ వర్కర్లపై నిర్లక్ష్యం చేస్తూ గత ప్రభుత్వం లోఆశ వర్కర్లను చిన్నచూపు చూచిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని చెప్పి ఆశల సమస్యలు పరిష్కరించడం లేదని మండిపడ్డారు ఆశాలకు ఫిక్స్డ్ వేతనం 18 వేలు ఈఎస్ఐ పీఎఫ్ ఉద్యోగ భద్రత తదితర సమస్యలను పరిష్కరించాలి డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్లు పాల్గొన్నారు.
