రాజకీయ పార్టీలకు ముదురాజులే కీలకం
మాజీ సైనిక వైద్యాధికారి డాక్టర్ కల్నన్ బిక్షపతి
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:
రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులు తమ సత్తా చోటాలని మాజీ సైనిక వైద్యాధికారి డాక్టర్ కల్నన్ బిక్షపతి ముదిరాజులకు పిలుపునిచ్చారు. ఆదివారం మండల కేంద్రంలో గల ముదిరాజ్ కమ్యూనిటీ హాల్లో ముదిరాజ్ సొసైటీ అధ్యక్షుడు దాసరి మధు అధ్యక్షతన జరిగిన సమావేశంలో కల్నన్ బిక్షపతిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బిక్షపతి మాట్లాడుతూ ముదిరాజులు రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారకూడదని సూచించారు. రాజకీయ పార్టీలకు ముదిరాజుల ఓట్లే కీలకమని, స్థానిక సంస్థల ఎన్నికల్లో ముదిరాజులు ప్రజాప్రతినిధులుగా గెలుపొందాలని సూచించారు. పార్టీలకతీతంగా ముదిరాజులు ఐక్యంగా ఉంటేనే రాజకీయ పార్టీల్లో వణుకు పుడుతుందని తెలిపారు. ముదిరాజులు రాజకీయంగా ఎదిగినప్పుడే సమాజంలో గౌరవ దక్కుతుందని అన్నారు. హక్కుల సాధన కోసం ముదిరాజులు ఐక్యంగా పోరాడాలని, ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ముదిరాజులు జనాభాలో సగభాగంగా ఉన్నారని, రాజకీయ అవకాశాలను హక్కుగా సాధించుకోవాలని సూచించారు. ముదిరాజుల ఐక్యతకు రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలు ఆదర్శం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి మాజీ ఉపసర్పంచ్ తరాల చంద్రబాబు, నాయకులు మామిండ్ల శ్రీను, కత్తి దస్తగిరి, జీడి సమ్మయ్య,దేశ బోయిన శ్రీనివాస్, మామిండ్ల సోమయ్య, జీడి సోమేశ్వర్, మామిండ్ల యాకయ్య, మామిండ్ల లక్ష్మణ్, జీడి శోభన్ బాబు, ఎల్లబోయిన సోమల్లు తదితరులు పాల్గొన్నారు.
