Breaking News

అనాథ పిల్లలకు అండగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య

మనప్రగతి న్యూస్ / యాదాద్రి భువనగిరి ప్రతినిధి

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు:-తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన పిల్లలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చేయూత నందించారు.ఆదివారం రోజున రాజపేట మండలం రేణికుంట గ్రామంలో ఇటీవల మరణించిన బర్ల బాల నర్సయ్య కుటుంబాన్ని ఆయన పరామర్శించారు.రోడ్డు ప్రమాదంలో బాలనరసయ్య గాయపడి మృతి చెందాడు.15 నెలల క్రితం బాల నరసయ్య భార్య రేణుక మృతి చెందింది.తల్లిదండ్రులు కోల్పోయిన చిన్నారులు కూతురు నికిషా,కొడుకు సాత్విక్ ఉన్నారు.తల్లిదండ్రులు ఇద్దరు మరణించడంతో అనదలైయ్యారు.వారి నానమ్మ గురువమ్మ ఉన్నప్పటికీ ఆమె వయో భారంతో ఇబ్బందిపడుతుంది.ఆమెకు 78 సంవత్సరాలు ఇప్పుడు ఆ ఇద్దరి పిల్లల్ని చూసుకునే పరిస్థితిలో లేదు ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య తక్షణసాయంగా బీర్ల ఫౌండేషన్ సౌజన్యంతో 10,000/- రూపాయలు అందజేసి ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అలాగే ఆ పిల్లలను ప్రభుత్వ పాటశాలల్లో చదివించడానికి మా వంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని అధికారుల తో మాట్లాడి హామీ ఇచ్చారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి