మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి
ఈ నెల 9 వ తారీఖున ప్రారంభమైన శీతాకాల అసెంబ్లీ సమావేశాలు కొనసాగింపుగా సోమవారంనాడు ప్రారంభం సమావేశం తర్వాత పర్యాటక రంగం విధానంపై ఎమ్మెల్యే కుందూరు జయవీర్ రెడ్డి ప్రస్తావిస్తు పలు అభివృద్ధి పనులను చేపట్టాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళటం జరిగింది. నాగార్జున సాగర్ అభివృద్ది లో బాగంగా 274 ఎకరాలలో అటవి శాఖ భూమిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో బుద్ధవనం ను అభివృద్ధి చేయటం జరిగిందని,అలాగే మిని జూపార్క ను నిర్మించటానికి సహయా సహాకారం అందించాలని అంతర్జాతీయ స్థాయిలో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కు ఎంతో ప్రాముఖ్యత ఉందని పర్యాటకులు సెలవు రోజుల్లో కుటుంబ సభ్యులతో ఆటవిడుపుకోసం సాగర్ పర్యాటక కేంద్రానికి రావటం జరుగుతుందని ఉండటానికి సరైన వసతి సదుపాయం అందుబాటులో లేక సందర్శకులు చాల ఇబ్బందులకు గురవుతున్నారని పర్యాటకుల కోసం స్థానిక విజయ విహార్ లో ప్రస్తుతం ఉన్న 38 రూమ్ లు సరిపోవని దీనిలో కన్వెన్షన్ రూమ్ లు పెంచాలని స్థానికులు ఉద్యోగాలు లేక వలస పోతున్నారని వారి కోసం 5 స్టార్ హోటల్ నిర్మాణం చేపడితే ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని పార్కులు శిధిలమై పోయాయని నాగార్జున సాగర్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలంటే రెనివేషన్ నిధులు పెంచటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,కేంద్ర మంత్రి వర్యులు పూర్తి స్థాయిలో సహయ సహకారాలు అందించాలని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వాన్ని కోరారు.
