Breaking News

రాష్ట్రీయ బాల స్వస్థ బృందం ఆద్వర్యంలో విద్యార్థులకు రక్త పరీక్షలు

మన ప్రగతి న్యూస్/నాగార్జున సాగర్ ప్రతినిధి

నందికొండ మున్సిపాలి పరిధిలోని స్థానిక మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల గురుకుల పాఠశాలలో   రాష్ట్రీయ బాల స్వస్థ బృందం ఆర్ బి ఎస్ కే  మొబైల్ టీమ్ సోమవారం పాఠశాల ఇంచార్జ్ ప్రిన్సిపాల్ రామానుజం సమక్షంలో డాక్టర్ రజిత ,  విద్యార్థులకు హిమో గ్లోబిన్ శాతం,ఆరోగ్య పరమైన పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంచార్జ్ ప్రిన్సిపాల్ వెంకన్న డా. రజిత మాట్లాడుతూ ప్రతీ విద్యార్థి ఆరోగ్యంగా ఉంటేనే విద్యలో చురుకుగా వుంటారని అన్నారు. విద్యార్థులు పోషకాలతో కూడిన బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని తెలియచేసారు. హిమోగ్లోబిన్ శాతము తక్కువ ఉన్న విద్యార్థుకు ఐరన్ పోలిక్ యాసిడ్ మందులు అందజేశారు. రక్తం 4 శాతం కన్నా తక్కువగా ఉన్న విద్యార్థులకు మాన్యువల్ గా నల్గొండలో పరీక్షలు నిర్వహించి రక్తం ఎక్కించడం జరుగుతుందని, ఈ పరీక్షలు 8 నుండి 18 సంవత్సరాల వయసుగల విద్యార్థులకు నిర్వహిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో       పాఠశాల ఫార్మసిస్ట్  ఎం సునీత, స్టాఫ్ నర్స్ జె.లలిత ,హెచ్ ఎస్ రజని ఉపాధ్యాయులు బుచ్చిబాబు, విద్యార్థులు పాల్గొన్నారు.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..