మన ప్రగతి న్యూస్/
మహబూబాబాద్ బ్యూరో
జిల్లా కేంద్రం, గిరిజన పార్లమెంట్ కేంద్రంలో లోకో మోటివ్ పిరియాడికల్ వర్క్ షాపు (లోకోమోటివ్ పి ఓ హెచ్) ఏర్పాటు చేయాలని మజ్దూర్ యూనియన్ వరంగల్ బ్రాంచ్ సెక్రెటరీ యుగంధర్ యాదవ్ ఆధ్వర్యంలో మజ్దూర్ యూనియన్ బృందం జాతీయ ఎస్టి కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ ను కలిసిన వినతి పత్రం అందజేశారు గిరిజన జనాభా అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో లోకోమోటివ్( పి ఓ హెచ్)ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశలు ఏర్పాటు కావడంతో పాటు మహబూబాబాద్ జిల్లా అభివృద్ధి చెండుతుంది అని అన్నారు మహబూబాబాద్ సమీపంలో ప్రభుత్వం భూమి అందుబాటులో ఉన్న విషయం అయన దృష్టికి తీసుకెళ్లారు.మహబూబాబాద్ జిల్లా కేంద్రానికి 5 కిలోమీటర్లు సమీపంలో ఉన్న తాళ్ళ పూసపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో రైల్వే భూమి కుడా ఉందని వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మహబూబాబాద్ ప్రాంతంలో నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే ఇటువంటి ప్రాజెక్టు ఖచ్చింతంగా రావాలని అందుకోసం రైల్వే శాఖ మంత్రి ని కలిసి మంజూరు అయ్యేలా కృషి చేస్తానని అన్నారు మహబూబాబాద్ జిల్లా బిడ్డగా తన భాద్యతగా తీసుకుని ఏర్పాటు అయ్యేలా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో సీనియర్ బిజెపి నాయకులు,ఆశోక్ రెడ్డి,గడ్డం ఆశోక్, శామ్, అజయ్,మజ్దూర్ యూనియన్ నాయకులు భాస్కర్ రావు, బుర్రి రమేష్, కొండ్రా నాగన్న తదితరులు పాల్గొన్నారు.
