Breaking News

ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి 

షుగర్, కిడ్నీ పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలి 

మాజీ సైనిక వైద్యాధికారి డాక్టర్ కల్నన్ బిక్షపతి

ఓం సార్ ఆసుపత్రి ఆధ్వర్యంలో 40 మందికి ఉచిత రక్త పరీక్షలు 

పడవ పల్టీ కొట్టి యువకుడు గల్లంతు..

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గ ప్రతినిధి:

ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని మాజీ సైనిక వైద్యాధికారి డాక్టర్ కల్నన్ మాచర్ల బిక్షపతి సూచించారు. సోమవారం జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలో గల ఓం సార్ ఆసుపత్రిలో డాక్టర్ అపర్ణ ఆధ్వర్యంలో 40 మందికి ఉచిత రక్త పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ బిక్షపతి మాట్లాడుతూ జబ్బులు తేలకుండానే ఆకస్మిక మరణాల సంఖ్య ఎక్కువగా పెరుగుతుందని తెలిపారు. శారీరక శ్రమ ఉండకపోవడంతో కొలెస్ట్రాల్ పెరిగి షుగర్ సమస్య ఎదురవుతుందని వివరించారు. ప్రతి ఇంట్లో షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని, ఆకస్మిక మరణాలను అరికట్టేందుకు వైద్య పరీక్షలు చేయించుకొని అప్రమత్తంగా ఉండాలన్నారు. షుగర్, కిడ్నీ పరీక్షలు చేయించుకొని ఆరోగ్యంగా ఉండేందుకు దృష్టి పెట్టాలన్నారు. రక్త లేమి పరీక్షలతో పాటు కిడ్నీ, షుగర్ పరీక్షలు తప్పనిసరి అవసరమన్నారు. ప్రజలు ఆరోగ్యం పై దృష్టి పెట్టినప్పుడే సమాజాభివృద్ధికి ఆదర్శంగా నిలుస్తారని సూచించారు.