Breaking News

ప్రశాంతంగా ముగిసిన గ్రూప్-II పరీక్షలు…

మన ప్రగతి న్యూస్/జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రతినిధి :
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పరీక్షా కేంద్రాల వద్ద పట్టిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసారు.
ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్
రెండు రోజుల పాటు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజిపిఎస్సి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్రూప్ -II పరీక్షల ను జిల్లాలో 17 పరీక్ష కేంద్రాల లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ప్రశాంతంగా ముగిసయని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పి కిరణ్ ఖరే ఐపీఎస్ తెలిపారు. రెండవ రోజు గ్రూప్ -ll పరీక్షల సందర్బంగా జిల్లా ఎస్పీ సోమవారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను సందర్శించి పరీక్షలు జరుగుతున్న తీరును పరిశీలించారు. జిల్లాలోని
అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగిందని తద్వార రెందవ రోజు కూడా పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి అని అన్నారు.
ఈ పరీక్ష సజావుగా సాగేందుకు అభ్యర్థులు కూడా సహకరించారని అన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రశాంత వాతావరణంలో పరీక్ష జరిగేలా అదనపు ఎస్పీ, డి.ఎస్.పిలు సిఐలు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

గుడ్ మార్నింగ్ స్కూల్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రాం