Breaking News

బిట్స్ ఏ ఐ & ఎమ్ ఎల్అధ్యాపకుని కి డాక్టరేట్ ప్రదానం

మనప్రగతి న్యూస్/నర్సంపేట:

లక్నెపల్లి లోని బాలాజీ ఇంజనీరింగ్ కళా శాలలో ఏ ఐ & ఎమ్ ఎల్ విభాగంలో అధ్యాపకుడి గా పని చేస్తున్న డాక్టర్. ప్రవీణ్ గుగులోతు “జీఎన్ మ్యుటేషన్స్ & మోటీవ్స్ డిటెక్షన్ ఫర్ కరోనా వైరస్ ఇన్ బయోలాజికల్ సీక్వెన్స్ అఫ్ కోవిద్ -19 యూసింగ్ “డీప్ లెర్నింగ్ మోడల్స్ “ అనే అంశం పై పరిశోధనాత్మక గ్రంధం ప్రచురించినందుకు ఎన్ ఐ టి
, వరంగల్ డాక్టరేట్ ప్రధానం చేసినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ . వి . ఎస్ . హరిహరన్ తెలిపారు. ఈ సందర్బంగా బాలాజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ .ఎ. రాజేంద్రప్రసాద్ రెడ్డి మరియు సెక్రటరీ
డాక్టర్ జి. రాజేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ ఆధునిక టెక్నాలిజీలలో విద్యా రంగాలలో తెస్తున్న విప్లవాత్మక మార్పులను గుర్తు చేస్తూ అతడిని అభినందించారు. ముఖ్య అతిధిగా ప్రిన్సిపాల్ డాక్టర్ వి. ఎస్.హరి హారన్ పాల్గొని మాట్లాడుతూ మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు కొత్త కొత్త సాంకేతికతను అలవరచుకోవాలిసిన అవసరం ఉంది అని అన్నారు. ముఖ్యముగా రాబోవు రోజులలో కృత్రిమ మేధకు సంబంధించిన నూతన సాంకేతికత అందుబాటులోకి రానున్న తరుణములో విద్యార్థులు ఎప్పటికప్పుడు తమకు తాము సంసిద్ధంగా ఉండాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో డీన్ అఫ్ అకాడెమిక్స్ డాక్టర్ . వి. నారాయణ , వివిధ విభాగాధిపతులు
డాక్టర్. జె . విజయ్ కుమార్, డాక్టర్. వి . శ్రవణ్ కుమార్ , డాక్టర్. బి . కృష్ణ , డాక్టర్. ఎం. శ్రీధర్ , డాక్టర్. ఎస్ . మల్లికార్జున్ రెడ్డి , డాక్టర్. పలని స్వామి , పరిపాలన అధికారి ఎస్. సురేష్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.

గుడ్ మార్నింగ్ స్కూల్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రాం