హిందువుకుల వీహెచ్పీ విజ్ఞప్తి
దేశంలో హిందువుల జననాల రేటు తగ్గుతోందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి హిందువు కనీసం ముగ్గురు పిల్లల్ని కనాలని పిలుపునిచ్చింది.
దేశంలో హిందువుల జననాల రేటు తగ్గుతోందని విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్పీ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలు ఉండేలా చూసుకోవాలని పిలుపునిచ్చింది.
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లోని మహాకుంభ్ నగర్లో జరిగిన విరాట్ సంత్ సమ్మేళన్లో సీఎం యోగి ఆదిత్యనాథ్, వీహెచ్పీ కేంద్ర ప్రధాన కార్యదర్శి బజరంగ్ లాల్ బాంగ్రా తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బజరంగ్ లాల్ బాంగ్రా మాట్లాడుతూ.. హిందువుల జననాల రేటు తగ్గడం వల్ల దేశంలోని హిందూ జనాభాలో సమతుల్యత లోపించిందన్నారు.
హిందువుల జననాల శాతం తగ్గుతోందన్నారు. అందుకే ప్రతి హిందూ కుటుంబంలో కనీసం ముగ్గురు పిల్లలును కనాలని కోరారు.