మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
రాజన్న సిరిసిల్ల :ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన ఓల్లెపు దేవరాజు తండ్రి ఓల్లెపు రాములు. సుమారు 40 సంవత్సరంలో అనుఅతను ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది బంధువులు తెలిపిన వివరాల ప్రకారం ఓ వ్యక్తికి చెందిన వ్యవసాయ బావి లో పూడికతీత పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓల్లెపు దేవరాజుకు విద్యుత్ షాక్ వచ్చిందని తెలిపారు. బంధువులు వెంటనే స్థానికంగా ఆస్పత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ప్రకటించారు. మృతునికి భార్య లలిత, ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని సిరిసిల్ల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
