Breaking News

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ 

పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన జనగామ డిసిపి 

మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి :

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజక వర్గం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని తహసిల్దార్ పొట్టబత్తుల శ్రీనివాస్ తెలిపారు. మండల కేంద్రంలో గల ఏర్పాటుచేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని జనగామ డిసిపి రాజమహేంద్ర నాయక్, వర్ధన్నపేట ఏసిపి అంబటి నర్సయ్య, పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డిలు సందర్శించి ఓటింగ్ సరళిని పరిశీలించారు. పాలకుర్తి మండలంలో మొత్తం 84 ఎమ్మెల్సీ ఎన్నికలకు ఉపాధ్యాయుల ఓట్లు ఉండగా 75 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, 9 మంది ఓటు హక్కు వినియోగించుకోలేదని తెలిపారు. 89. 29% ఓటింగ్ నమోదయిందని అన్నారు. పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పాలకుర్తి ఎస్సైలు దూలం పవన్ కుమార్, ఎం లింగారెడ్డి, ఆర్ ఐ రాకేష్, పోలింగ్ సిబ్బంది పాల్గొన్నారు.