మన ప్రగతిన్యూస్/ చిట్యాల
చిట్యాల మండలం కాల్వపల్లి గ్రామానికి చెందిన పెద్ది కిట్టయ్య పెద్ద కుమారుడు పెద్ది సతీష్ కొంతకాలంగా మద్దానికి బానిస అయ్యి భార్యతో గొడవ పడుతున్నాడు. ఈ క్రమంలో అతని భార్య అయినా పెద్ది లక్ష్మి నెల రోజుల నుంచి పుట్టింటి వద్ద ఉంటుంది. ఈ క్రమంలో గురువారం రోజు అధికంగా మద్యం సేవించి ఇంట్లోనే పైకప్పు రేకుకు సపోర్ట్ గా వేసిన ఇనుప వైపుకు ప్లాస్టిక్ తాడుతో ఉరివేసుకొని చనిపోయాడు. తన కుమారుడైన
పెద్ది సతీష్ మద్యానికి బానిస అయ్యి భార్య కాపురానికి రావట్లేదని మనస్థాపంతో ఉరి వేసుకుని చనిపోయాడని తన తండ్రి పెద్ది కిట్టయ్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై జి శ్రవణ్ కుమార్ తెలిపారు
