Breaking News

అంగరంగ వైభవంగా ఐదో రోజు అటుకుల బొడ్డెమ్మ

మన ప్రగతి న్యూస్/ నర్సంపేట

నర్సంపేట పట్టణంలోని గంగపుత్ర వీధిలో ఐదో రోజు అటుకుల బొడ్డెమ్మ అంగరంగ వైభవంగా మహిళలంతా కలిసి జరుపుకున్నారు. బతుకమ్మ పాటలతో కోలాటం ఆడుతూ ఘనంగా జరుపుకున్నారు. తమ కుటుంబాలు, ప్రజలు సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో వర్ధిల్లాలని వేడుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి సంతోషంగా ముఖ్యంగా యువతులు తమకు మంచి తోడు దొరకాలని తమ జీవితం సుఖ సంతోషాలతో వెలగాలని కోరుకున్నారు.ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్పర్సన్ గుంటి రజని మాట్లాడుతూ అనాదిగా వస్తున్న మన సాంప్రదాయాన్ని మన ఆచారాలను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఐదో రోజు బొడ్డెమ్మను అటుకుల బొడ్డెమ్మంటారని ఈరోజు అటుకులను నైవేద్యంగా సమర్పించి ప్రసాదంగా స్వీకరిస్తారని తెలిపారు. ముఖ్యంగా యువతులు బొడ్డెమ్మ వేడుకలో అధిక సంఖ్యలో పాల్గొనాలని అది వారికి మంచి జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో గంగపుత్ర మహిళా అధ్యక్షురాలు గుంటి రమ, డైరెక్టర్స్ చింతల రేఖ, మేధరబోయిన శైలజ, తుంగతుర్తి సునీత, అంబటి రజని, అనుమాండ్ల అనురాధ, లక్ష్మి, రుద్ర, అమూల్య, దీప, సంధ్య, గౌతమి, సత్య, మాధవి, రవళి,అనూష,అర్చన, సరళ తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేటలో ఘనంగా ఆర్ఎస్ఎస్ పథసంచలన్