డిసిపి అంకిత్ కుమార్
యువత విరివిగా రక్తదానం చేయాలి
ఏసిపి రవీందర్
ఈనెల 30న వాక్ రన్ యువత అధిక సంఖ్యలో పాల్గొనాలి
సిఐ రఘుపతి రెడ్డి
మన ప్రగతి న్యూస్/ నర్సంపేట
నర్సంపేట పట్టణంలో పోలీసు అమరవీరుల వారోత్సవాలను పురస్కరించుకొని నర్సంపేట డివిజన్ పోలీస్ ల ఆధ్వర్యంలో సిటిజన్ క్లబ్లో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరంలో ముఖ్యఅతిథిగా డీసీపీ అంకిత్ కుమార్ పాల్గొని రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ఒకరు రక్తదానం చేస్తున్నారంటే మరొకరికి ప్రాణదానం చేస్తున్నట్టేనని అన్నారు. రక్తం ఇవ్వడం వలన ఆ వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. మూడు నెలలకు ఒకసారి రక్తం ఇవ్వడం వలన అతనిలో నూతన రక్తం వస్తుందని, యువత ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం అన్నారు.
ఏసిపి రవీందర్ మాట్లాడుతూ
ఇటువంటి కార్యక్రమాల పట్ల యువత ఆసక్తి కనబరచాలని, ముందుకు వచ్చి విరివిగా రక్తదానం చేయాలన్నారు.
పట్టణ సీఐ రఘుపతి రెడ్డి మాట్లాడుతూ
యువత అధిక సంఖ్యలో పాల్గొనడం, రక్తదానం పై అవగాహన కార్యక్రమం పెంపొందించుకోవడం చాలా సంతోషదాయకమన్నారు. రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగిందని దాదాపుగా 250 మంది రక్త దాతలు పాల్గొనడం చాలా సంతోషదాయకమన్నారు. రక్తం ఇవ్వడం వలన మనిషి ఆరోగ్యంగా ఉండటమే కాక అతనిలో కొత్త బలం వస్తుందని తెలిపారు. ఈ నెల 30న పోలీస్ ల ఆధ్వర్యంలో ఉదయం 6:30 కి 3కె రన్ ర్యాలీ ఉందని అందులో యువత ఎక్కువగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. మనిషి ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యమని ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం వల్ల ఆరోగ్యం పై శ్రద్ధ పెరుగుతుందన్నారు. చెడు వ్యసనాలకు యువత ఎప్పుడు దూరంగా ఉండాలని సన్మార్గంలో నడిచి పలువురికి ఆదర్శంగా ఉండాలని తెలిపారు. రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్, ఎస్సై గూడ అరుణ్, చెన్నారావుపేట ఎస్సై రాజేష్ రెడ్డి,కానాపురం ఎస్ఐ రఘుపతి, మిగతా మండలాల సిఐలు,ఎస్ఐలు, పోలీసులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆటో యూనియన్ నాయకులు, యువత, స్వచ్ఛందంగా పాల్గొన్నారు.







