మన ప్రగతి న్యూస్ / ఏన్కూర్:
ఏన్కూర్ మండలానికి నూతన మండల అభివృద్ధి అధికారి (ఎం.పి.డి.ఓ)గా గ్రూప్–1 అధికారి పల్లి భాగ్యశ్రీ బాధ్యతలు స్వీకరించారు. గతంలో వరంగల్ కమిషనరేట్లో ఎస్హెచ్ఓగా పనిచేసిన ఆమె, ప్రభుత్వ శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఏన్కూర్ మండలానికి నియమితులయ్యారు.ఇంతకుముందు ఎంపీడీవోగా ఉన్న రంజిత్ కుమార్ వేంసూర్ మండలానికి ఎంపీ ఒగా బదిలీ అయ్యారు. సోమవారం నాడు భాగ్యశ్రీ అధికారికంగా పదవిలో చేరగా, ఏన్కూర్ ఎంపీ ఓ జీవీఎస్ నారాయణ, రంజిత్ కుమార్, సూపరింటెండెంట్ తుమ్మలపల్లి కృష్ణ, పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది శాలువా కప్పి సన్మానం చేశారు.భాగ్యశ్రీ మాట్లాడుతూ ఏన్కూర్ అభివృద్ధి దిశగా అధికారుల సమన్వయంతో కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ సూరయ్య, పంచాయతీ కార్యదర్శుల సంఘం అధ్యక్షుడు రవికుమార్, సెక్రటరీ కోటేశ్వరరావు, పంచాయతీ కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


