ఎమ్మార్వో ముప్పు కృష్ణ
మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి
మండలంలోని ప్రజలందరూ భారీగా వర్షాలు కురుస్తున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఎమ్మార్వో ముప్పు కృష్ణ తెలిపారు.కరెంట్ స్తంభాలను, విద్యుత్ వైర్లను, ట్రాన్స్ ఫార్మర్లను తాకకండి.మ్యాన్ హోల్స్, డ్రైనేజీలను చూసుకుని నడవండి.ఉధృతంగా ప్రవహించే చెరువులు, వాగుల వద్దకు వెళ్లకండి.వ్యవసాయ తదితర పరిసర ప్రాంతాల్లో విష సర్పాలతో జాగ్రత్త అని అన్నారు.పాత గోడలు, పాత ఇండ్లు కూలిపోయే స్థితిలో ఉంటే ముందస్తు జాగ్రత్తగా ఉండండి అని తెలిపారు.
అత్యవసరం ఉంటే తప్ప బయటకు వెళ్లకండి అని తగు సూచనలు చేశాడు.

