Breaking News

భక్తిశ్రద్ధలతో శివయ్యకు వెండి చెమ్ము సమర్పణ

మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్:

ఏన్కూర్ లోని స్థానిక శివాలయంలో మాదినేని అశోక్–ఉషా దంపతుల కుమార్తె, అల్లుడు నవీన–యోగిరాం దంపతులు భక్తిశ్రద్ధలతో పూజా అభిషేక కార్యక్రమాలు నిర్వహించారు. శివయ్యకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేసి, భక్తిపూర్వకంగా రూ.17,200 విలువగల వెండి చెమ్మును శివాలయానికి సమర్పించారు.ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం హరహర మహాదేవ శబ్దాలతో మార్మోగింది. కుటుంబ సభ్యులు, బంధువులు,గ్రామ భక్తులు పాల్గొని శివదర్శనం చేసుకున్నారు.ఈ కార్యక్రమంలో వేముల రమేష్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.వారి భక్తి, దాతృత్వం పట్ల శివాలయం కమిటీ ప్రశంసలు తెలుపుతూ, శివపార్వతుల అనుగ్రహం ఎల్లవేళలా వారి కుటుంబంపై ఉండాలని ఆకాంక్షించింది.

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..