పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
మొంథ తుఫాన్ ప్రభావంతో మంగళవారం రాత్రి నుండి జనగామ, మహబూబాబాద్,వరంగల్ జిల్లాలలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పాలకుర్తి శాసన సభ్యురాలు యశస్విని రెడ్డి బుధవారం సంబంధిత జిల్లాల కలెక్టర్లతో ఫోన్ ద్వారా మాట్లాడి, అన్ని శాఖల అధికారులు తమ తమ ప్రధాన కార్యస్థానాల్లోనే అందుబాటులో ఉండాలని సూచించారు.ఇటీవల ప్రారంభమైన ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తగిన ఏర్పాట్లు చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. నియోజకవర్గంలోని పలు మండలాలు, గ్రామాల్లో వర్షాలు తీవ్రంగా కురుస్తుండటంతో ప్రజల భద్రతపై తక్షణ చర్యలు తీసుకోవాలని, ముఖ్యంగా తక్కువ ప్రాంతాలు, చెరువులు, వాగులు, డ్రెయిన్లు నిండిపోవడంతో ఎటువంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ప్రజల అవసరం అయితే తప్ప ఎవరూ బయటకు రావద్దు. విద్యుత్ తీగలు తెగిపోయిన చోట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లలను నీటి ప్రదేశాలకు వెళ్లనీయకూడదు, అని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ప్రజలకు సూచించారు.
రెవెన్యూ, పోల
