. నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం
మన ప్రగతి న్యూస్ /రామన్నపేట :
మొంథా తుఫాను ప్రభావం వలన ఒక్కసారిగా వాతావరణం మారిపోయి దాదాపు మంగళవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం కోరారు.అధికారులు కార్యాలయాల్లో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.నిర్విరామంగా పడుతున్న వర్షానికి వాగులు,కాలువలు చెరువులు, పొంగిపొర్లుతుంటాయి కాబట్టి జాగ్రత్తలు వహించాలని కోరారు.ఎట్టి పరిస్థితులలో విద్యుత్ స్తంభాలు తాకరాదని తెలిపారు.అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని,ఒకవేళ వెళ్లాల్సి వస్తే రోడ్డుపై వెళ్తున్నప్పుడు గుంతలను, తెగి పడిన విద్యుత్ వైర్లను గమనించి అప్రమత్తమై క్షేమంగా తమ గమ్య స్థానాలకు చేరుకోవాలని ప్రజలకు సూచనలు చేశారు.

