_ స్థానిక ఎమ్మార్వో రామచంద్రం
మన ప్రగతి న్యూస్/ ముస్తాబాద్
ముస్తాబాద్ మండల కేంద్రంలోని మండల స్థానిక తాసిల్దార్ రామచంద్రం రైతులకు పలు సూచనలు తెలిపారు.ఈ సందర్భంగా మొంథా తుఫాన్ వలన స్వల్ప అధిక భారీ వర్షాలు ఉన్నందున మండలం లోని రైతులకు తగు జాగ్రత్త లు తీసుకోవాల్సిందిగా కోరారు.
రైతులు హార్వెస్టర్ ద్వారా కోసిన వరి పంటను ఇప్పటికే ధాన్య కొనుగులు కేంద్రంలకు వచ్చి తూకం వేసినా వాటిని వెంటనే రైసుమిల్క్ తరలించాలని కోరారు,ధాన్యం కేంద్రం లో అరపోసేందుకు ఉన్నా ధాన్యం కుప్పలు గా చేసి తగిన కవర్ తో కప్పివుంచి నీరు వెళ్లకుండా చూసుకోగలరు అని తెలిపారు, రైతులు వర్షాలు తగ్గే వరకు అర్వెస్టర్ కోతలు వెంటనే నిలిపివేయలని అన్నారు,
రైతులు తగు ముందు జాగ్రత్త లు పాటించి పంట నష్టం కాకుండా అధికారుల కు సహకరించగలరు అని తెలిపారు,

