ములకలపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షులు తాండ్ర ప్రభాకర్ రావు
మన ప్రగతి న్యూస్/ములకలపల్లి
రైతులు వరి కోతలు వాయిదా వేసుకోవాలి. నదీ పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలి. తక్కువ ఎత్తు ప్రాంతాల ప్రజలు ముందస్తు చర్యలు చేపట్టాలి. రహదారులు, వంతెనలు, వాగులు దాటే సమయంలో జాగ్రత్త అవసరం. పిల్లలు, వృద్ధులు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దు. తెగిపోయిన విద్యుత్ తీగలు, కూలిన చెట్ల వద్దకు వెళ్లకూడదు. కోసిన వరి పంటను సురక్షిత ప్రదేశాలకు తరలించి కవర్ చేయాలి. రైతులు ముందస్తు చర్యలతో ఆర్థిక నష్టాలను నివారించుకోవచ్చు. పంట నిల్వ కేంద్రాల వద్ద రక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులకు ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆదేశం..

