Breaking News

దొంగను పట్టుకున్న నర్సంపేట పోలీసులు

మన ప్రగతి న్యూస్ /నర్సంపేట

ఖానాపురం మండలం కు చెందిన వ్యక్తి దొంగతనాలు చేస్తూ జీవించేవాడని అతని నర్సంపేటలో పట్టుకోవడం జరిగిందని పట్టణ సీఐ రఘుపతి రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు తెలిపిన వివరాల ప్రకారం ఖానపురం మండలం కీర్యతండ కి చెందిన బాధవత్ . రాములు తండ్రి వెంకట్రామ్, అను వ్యక్తి హైదరాబాద్ లో ఆటో నడుపుతూ జీవించేవాడు. తన జల్సాలకు డబ్బులు సరిపోక దొంగతనలు చేయడం ప్రారంభించాడు. ఈ విధంగా గత సంవత్సరం వరంగల్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా ఉన్న ఒక ఆటో దొంగతనం చేశాడు. తరవాత నర్సంపేట శివారులో ఒక వ్యవసాయ మోటర్ దొంగతనం చేశాడు. గత వారం రోజుల కింద హైదరాబాద్ మేడిపల్లి పరిధిలో ఒక ఆటో దొంగతనం చేసి కీర్య తండా కి వచ్చాడు . బుధవారం అదే ఆటో లో నర్సంపేట కి వస్తుండగా మెడికల్ కాలేజీ సమీపంలో అనుమానం వచ్చి పట్టుకొని విచారించగా తను చేసిన దొంగతనల గూర్చీ ఒప్పుకోవడం జరిగింది. తదనంతరం అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరచడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై అరుణ్ కుమార్ పాల్గొన్నారు

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి