Breaking News

మోంథా తుఫాన్ ప్రభావం తీవ్రం – ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఏన్కూర్ తాసిల్దార్ సి.హెచ్. శేషగిరిరావు సూచనలు

మన ప్రగతి న్యూస్/ఏన్కూర్

బైక్ స్కిడ్ అయి యువకుడికి తీవ్ర గాయాలు

మోంథా తుఫాన్ ప్రభావం తీవ్రంగా కొనసాగుతుందని ఏన్కూర్ మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల తాసిల్దార్ సి.హెచ్. శేషగిరిరావు సూచించారు. సాధ్యమైనంత వరకు ఇళ్లలోనే ఉండాలని, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే బయటకు రావాలని ప్రజలను కోరారు.అదేవిధంగా మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకూడదని, పశువులను ఏరులు, చెరువుల వద్దకు తీసుకెళ్లరాదని హెచ్చరించారు. అవసరం ఉన్నపుడు మాత్రమే ప్రయాణాలు చేయాలని, రాత్రివేళల్లో వర్షం కారణంగా వరద ప్రవాహాలు పెరిగే అవకాశం ఉండటంతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.విద్యుత్ స్తంభాలు, విద్యుత్ ఉపకరణాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచిస్తూ, ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైన వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని తాసిల్దార్ శేషగిరిరావు విజ్ఞప్తి చేశారు.