-అదనపు కలెక్టర్(రెవెన్యూ) మహేందర్ జీ
మన ప్రగతి న్యూస్/వాజేడు:
చత్తీస్ ఘడ్ రాష్ట్రం నుండి వరి ధాన్యం తెలంగాణకు రాకుండా అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రంలో 24 గంటలు అప్రమత్తంగా ఉండాలని అదనపు కలెక్టర్(రెవెన్యూ) సిహెచ్. మహేందర్ జీ అన్నారు.బుధవారం వాజేడు మండలం, చెరుకూరు గ్రామంలో అంతర్రాష్ట్ర సరిహద్దు తనిఖీ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పక్క రాష్ట్రం నుండి దళారులు రాకుండా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలన్నారు.తెలంగాణ రైతులు మద్దతు ధర, బోనస్ పొందే విధంగా చూడాలన్నారు. చెక్ పోస్ట్ సిబ్బందికి పలు సూచనలు, సలహాలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల మేనేజర్ రాంపతి, సివిల్ సప్లై అధికారి పైజల్ హుస్సేన్, వాజేడు తహసిల్దార్ శ్రీనివాస్, నయాబ్ తాసిల్దార్ రామ్ సింగ్,ఆర్ఐ కుమారస్వామి, ఏఈఓ హరీష్ తదితరులు పాల్గొన్నారు

