Breaking News

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయండి

పట్టణంలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలి

వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) యాదయ్య

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి

ఇందిరమ్మ ఇంటి నిర్మాణాలను త్వరగా పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని వార్డ్ అధికారులకు వనపర్తి జిల్లా అడిషనల్ కలెక్టర్ (స్థానిక సంస్థలు) యాదయ్య ఆదేశించారు. ఈ సందర్భంగా బుధవారం రోజు వనపర్తి జిల్లా ఆత్మకూర్ పట్టణ కేంద్రంలోని స్థానిక మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులు త్వరగా ఇంటి నిర్మాణం పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని వార్డ్ అధికాలకు సూచించారు. పట్టణంలో పారిశుద్ధ్యం పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పారిశుద్ధ్య కార్మికులకు గౌరవం ఇవ్వాలని తెలిపారు. వర్షాలు నేపథ్యంలో అంటు వ్యాధులు ప్రబలకుండా చూడాలని శిథిలా వ్యవస్థలో ఉన్న గృహాలలో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని ఆదేశించారు పట్టణంలో త్రాగునీటికి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాటు చేయాలని స్థానిక కమిషనర్ కు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మున్సిపల్ కమిషనర్ చికినే శశిధర్, వార్డు అధికారులు, జూనియర్ అసిస్టెంట్లు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.