అప్రమత్తంగా వ్యవహరిస్తున్న పంచాయతీ కార్యదర్శి గోపి
మన ప్రగతి న్యూస్/ఏన్కూర్
మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏన్కూరు–లింగన్నపేట రహదారిపై వాగు అలుగుపడి రోడ్డుపై నీరు ప్రవహిస్తోంది. వరద ఉధృతి కారణంగా రాకపోకలు తీవ్రంగా అంతరాయం ఎదుర్కొంటున్నాయి.ప్రమాదాలను నివారించేందుకు లింగన్నపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి గోపి, సిబ్బందితో కలిపి అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. రోడ్డుపై ఇరువైపులా ట్రాక్టర్లు నిలిపి, ప్రజలను వరద నీటిలోకి వెళ్లకుండా అడ్డుకుంటూ జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు ప్రజలను అత్యవసర పరిస్థితులు తప్ప రాకపోకలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.


