మన ప్రగతి న్యూస్/వాజేడు:
ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించాలని ఆదివాసి నాయకులు అన్నారు.నవంబర్ 3వ తేదీన చలో ఐటీడీఏ ఏటూరునాగారం విజయవంతం చేయాలని ఆదివాసి జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపునిచ్చారు. బుధవారం పేరూరు గ్రామంలో ఐటీడీఏ ముట్టడి కరపత్రాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1976 సంవత్సరంలో అక్రమ మార్గంలో లంబాడీలను ఎస్టీ జాబితాలో కలపడం వలన ఆదిమ తెగలకు తీరని అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. లంబాడీలు రాజస్థాన్ లో ఓసిలుగా, మహారాష్ట్రలో బీసీలుగా, కర్ణాటకలో ఎస్సీలుగా ఉన్నారన్నారు. తెలంగాణకు విపరీతంగా వలసలు పెరిగి 60లక్షలకు పైగా జనాభా లంబాడీలు ఉన్నారని, చట్టబద్ధత లేని లంబాడీలను వెంటనే ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు పాయం జానకి రమణ,దబకట్ల సుమన్,ప్రతాప్, చింత మోహన్, బుచ్చయ్య, సంతోష్ తదితరులు పాల్గొన్నారు

