Breaking News

రన్ ఫర్ యూనిటీ కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం

ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్

మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-

ఇంటర్మీడియట్ పరీక్ష కేంద్రాల వద్ద కఠిన నిషేధాజ్ఞలు..

భారతదేశ ఐక్యతకు ప్రత్యేకంగా నిలిచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 31న ఏక్తా దివాస్ ను దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తారు కావున ప్రజల్లో ఐక్యత, సమగ్రత, జాతీయ భావాలను బలపరిచే ఉద్దేశంతో వనపర్తి జిల్లా ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గురువారం రోజు ఉదయం 8 గంటలకు జూరాల ఎక్స్ రోడ్ నుండి జూరాల కెనెల్ వరకు 2కే రన్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఇట్టి కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు, పోలీసులు, విద్యార్థులు, స్వచ్ఛంద సంస్థలు, క్రీడాకారులు మరియు ప్రజా ప్రతినిధులు పాల్గొని దేశ ఏకత్వం పట్ల తమ కట్టుబాటులో వ్యక్తం చేయాలని జాతీయ ఏకత్వం పట్ల అంకిత భావాన్ని తెలియజేయాలని ఆత్మకూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.