జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
మన ప్రగతి న్యూస్/ జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మొంథా తుఫాను ప్రభావం దృష్ట్యా భద్రతా చర్యలలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల పాఠశాలలతో పాటు అంగన్వాడీ కేంద్రాలకు 30వ తేదీ గురువారం సెలవు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
వాతావరణ శాఖ హెచ్చరికలను పరిగణనలోకి తీసుకొని విద్యార్థులు, చిన్నారుల భద్రతా చర్యలపై జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని ఆయన పేర్కొన్నారు. అన్ని మండలాల విద్యాశాఖాధికారులు, ప్రధానోపాధ్యాయులు, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తమ పరిధిలోని పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు ఈ సమాచారాన్ని తక్షణమే తెలియజేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. తుఫాను పరిస్థితులపై జిల్లా నియంత్రణ కేంద్రం నిరంతరం పర్యవేక్షణ చేస్తోందని, అత్యవసర సందర్భాల్లో వెంటనే సమాచారం అందించాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.

