మన ప్రగతి న్యూస్/వనపర్తి/ఆత్మకూర్:-
కార్తీక మాసం సందర్భంగా భక్తుల సందడితో వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామంలో శ్రీ పాండురంగ స్వామి దేవాలయంలో నందు కార్తీకదీపం ఉత్సవం శ్రీ పాండురంగ స్వామి భజన మండలి ఆధ్వర్యంలో సంకీర్తన కార్యక్రమం నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తులు పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పుణ్య స్థానాలు దీపారాధనలు ప్రత్యేక పూజలు వ్రతాలు వంటి కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించడం వ్రతాలు ఆచరించడం వంటి కార్యక్రమాలలో మహిళలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి శ్రీధర్ జోషి, ఆలయ కమిటీ పెద్దలు, మహిళలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.


