మనప్రగతి న్యూస్/ జగదేవపూర్ ప్రతినిధి:
సిద్ధిపేట జిల్లా జగదేవపూర్ కార్తిక పౌర్ణమి సందర్భంగా జంగం రెడ్డి పల్లి గ్రామ సమీపంలోని శ్రీ రాముని బండ శ్రీ సీత రామచంద్ర స్వామి వారిని బుధవారం సీఐ మహేందర్ రెడ్డి స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు,
ఆలయం అర్చకులు ప్రత్యేక పూజలు చేసి శాలువాతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనంతరం ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా చూడాలని పోలీస్ సిబ్బంది కి తెలిపారు.ఈ కార్యక్రమంలో వారి వెంట జగదేవపూర్ సబ్ ఇన్స్పెక్టర్ కృష్ణారెడ్డి, జంగంరెడ్డి పల్లి గ్రామ మాజీ సర్పంచ్ కుమార్ ఉన్నారు.

