Breaking News

విద్యార్థులకు ఉచితంగా బ్యాగుల పంపిణి

మన ప్రగతి న్యూస్ / వనపర్తి ప్రతినిధి :

వనపర్తి జిల్లా కొత్తకోట మండలం మిరాసిపల్లి గ్రామ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆరు నుండి తొమ్మిదవ తరగతి వరకు చదివే విద్యార్థినీ, విద్యార్థులకు స్నేహ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ వ్యవస్థాపకులు రామ్ రెడ్డి బ్యాగులను వితరణ చేశారు. ఈ సందర్బంగా ఆయనను పాఠశాల ఉపాధ్యాయులు శాలువాతో ఘనంగా సత్కరించారు. అనంతరం అయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి చదువులు చదువుకొని భవిష్యత్తులో గ్రామానికి పేరు తీసుకురావాలని కోరారు.స్నేహ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం ఆయా గ్రామాలలోని పేద విద్యార్థులందరికీ బ్యాగులు నోటుబుక్కులు వితరణ చేస్తున్నమని అందులో భాగంగా మిరాజ్ పెళ్లి గ్రామాన్ని కూడా ఆ లిస్టులో ఎంపిక చేసి భవిష్యత్తులో మన పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కూడా బ్యాగులు, పుస్తకాలు, బెల్టులు బూట్లు వచ్చే విధంగా ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు జి శ్రీనివాసరెడ్డి, గ్రామ పెద్దలు శేఖర్ రెడ్డి,శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి