మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిహెచ్ఎంవో చందు నాయక్ గురువారం సందర్శించారు.ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వ్యాధి నిరోధక టీకాలు నిల్వ చేసే ఫ్రీజర్స్,వ్యాక్సిన్ నిల్వ పద్ధతులను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు తగు సూచనలు చేశారు.ఫార్మసీ,మందుల రికార్డులను పరిశీలించారు.వ్యాక్సిన్స్ పాడవకుండా చూసుకోవాలని వైద్య అధికారి కి, ఫార్మసిస్ట్ కు సూచించారు.ప్రతి గ్రామంలో గర్భిణీల వివరాల నమోదుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణి, ఆయుష్ డాక్టర్ సంధ్య,సిబ్బంది అర్చన, రజిత పాల్గొన్నారు.

