హాజరై పంపిణీ చేసిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి…
పొంగులేటి చొరవతో లబ్ధిదారుల ముఖాల్లో సంతోష కిరణాలు…
మన ప్రగతి న్యూస్ / ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో :
ఖమ్మం జిల్లా కూసుమంచి మండల పాలేరు నియోజకవర్గ పేదల కష్టాలు తీర్చడమే ప్రజా ప్రతినిధి నిజమైన ధర్మమని నమ్మే తెలంగాణ రెవెన్యూ గృహనిర్మాణం సమాచార శాఖ మంత్రిపొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆ స్ఫూర్తిని మరోసారి ఆచరణలో చూపించారు.పాలేరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కూసుమంచి నందు..పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేతులు మీదుగా కూసుమంచి మండల పరిధిలోని 90మందిలబ్ధిదారులకుసుమారుగా37లక్షల97వేల,500రూపాయల విలువచేసే చెక్కులను లబ్ధి దారులకుపంపిణీచేశారు.సీఎంఆర్ఎఫ్ సహాయం అందుకున్న లబ్ధిదారులకళ్లల్లోఆనందభాష్పాలు కమ్ముకున్నాయి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమకు ప్రభుత్వం అండగా నిలిచిందని భావోద్వేగంతో తెలిపారు.ఈ కార్యక్రమంలో ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి, సి డి సి చైర్మన్ సూర్యనారాయణ రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, ఆత్మ కమిటీ డైరెక్టర్లు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.


