మన ప్రగతి న్యూస్/శంకరపట్నం:
శంకరపట్నం మండలం కరీంపేట గ్రామానికి చెందిన చింతం తిరుపతి,గుర్రం రమేష్,బొజ్జ లింగయ్య, కర్రె శ్రీనివాస్, కేతిరి శ్రీనివాసరెడ్డి లకు అందాల్సిన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు కొందరు అక్రమార్కులు అవకతవకలు చేసి చెక్కులను విడిపించుకున్నారు. వారికి సంబంధించిన పూర్తి ఆధారాలతో కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణిలో రాసమల్ల శ్రీనివాస్ ఫిర్యాదు చేశారు.శ్రీనివాస్ మాట్లాడుతూ ఒకే గ్రామానికి చెందిన ఐదుగురి చెక్కులను అక్రమంగా కాజేసిన నాయకులపై, వారికి సహకరించిన అధికారులపై క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని,లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు.

