మన ప్రగతి న్యూస్/ నల్గొండ/వేములపల్లి
తన భూమిని అక్రమంగ
ఆక్రమించుకుని తమను ఇబ్బందులకు గురించేస్తున్న వ్యక్తులకు ఎస్సై వత్తాసు పలుకుతున్నారని నల్గొండ జిల్లా ఎస్పీకి పిర్యాదు చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది.వరాల్లోకి వెళితే వేములపల్లి మండల పరిధిలోని బుగ్గబ్బాయి గూడెం గ్రామానికి చెందిన బొంగర్ల సైదమ్మ భర్త మల్లేష్ అయినటువంటి గ్రామంలోని సర్వే నెం.9,10,11లోని భూమిని అన్నదిగ సేద్యం చేసుకుంటున్నామని ఎప్పటిలోగానే ఈ సంవత్సరం కూడా పొలం సేద్యం చేసుకుంటున్న క్రమంలో గ్రామానికి చెందిన నంద్యాల సరిత,వెంకట్ రెడ్డి, మహేందర్ రెడ్డి,మహిపాల్ రెడ్డి అట్టి పొలం మాది అని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వేములపల్లి ఎస్ఐ డి.వెంకటేశ్వర్లుకు పిర్యాదు చేయగా పిర్యాదు చేసిన నాపైనే పలు మార్లు కేసులు పెట్టి రౌడీ సీట్ ఓపెన్ చేస్తామని బెదిరింపులకు గురి చేస్తున్నారని వాపోయారు.మేము నాటిన పొలం కోత దశకు రావడంతో పంటలు కోసుకుని ఇంటికి వచ్చే దశలో పోలీస్ వారు సదరు వారు ఇచ్చిన సమాచారం మేరకు నాయొక్క పంటను తీసుకువచ్చి పోలీస్ స్టేషన్ లో పెట్టారని.ఇలా అయితే మా దంపతులము ఇద్దరమూ ఆత్మ హత్య చేసుకుంటామని వాపోయారు.సివిల్ కేసులో ఇన్వాల్ అయి మమ్ములను ఇబ్బంది పెడుతున్న సదరు ఎస్ఐ పై చర్యలు తీసుకోవలని ఎస్పీ కి పిర్యాదు చేసినట్టు వారు తెలిపారు.

