-సర్పంచ్ అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ కృషి చేయాలి
-యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్
మన ప్రగతి న్యూస్ /నర్సంపేట
ఈనెల 5న నర్సంపేటలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పర్యటనను విజయవంతం చేయాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ నాయకులు కృషి చేయాలని నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత నర్సంపేట నియోజకవర్గ శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆశీస్సులతో నర్సంపేట స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన యుత్ కాంగ్రెస్ సమావేశంలో నర్సంపేట నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తుమ్మలపెల్లి సందీప్ మాట్లాడుతూ నియోజకవర్గంలో విద్యా, వైద్యం, రోడ్లు, త్రాగునీరు, సాగునీరు, మరియు పలు ప్రభుత్వ రంగ సంస్థల భవనాల నిర్మాణాలను చేపట్టి నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలనే గొప్ప సంకల్పంతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి , రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో మాట్లాడి వారిని ఒప్పించి మెప్పించి నియోజకవర్గ అభివృద్ధికీ 1000 కోట్ల నిధులను తీసుకొచ్చి ఈనెల 5న సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన పనులను ప్రారంభోత్సవం చేసుకోబోతున్న సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కి ప్రత్యేక కృతజ్ఞతలను తెలియజేస్తున్నానని అన్నారు, నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి మొదటి సభను విజయవంతం చేయవలసిందిగా యూత్ కాంగ్రెస్ నాయకులకు పిలుపునిచ్చారు, అదే విధంగా నియోజకవర్గంలో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపుకు యూత్ కాంగ్రెస్ నాయకులు శ్రమించాలని రాష్ట్రంలోనే అత్యధిక సర్పంచ్ స్థానాలను మన నియోజకవర్గంలో గెలిపించుకొని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రతిష్టలు రాష్ట్రవ్యాప్తంగా చాటే బాధ్యత ప్రతి యూత్ కాంగ్రెస్ నాయకుడిపై ఉందని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ జాయింట్ సెక్రెటరీ మోడెం ఎల్లగౌడ్, వరంగల్ జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు రూపిక శ్రావణ్ కుమార్, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పల్స ప్రశాంత్ గౌడ్, నర్సంపేట పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఎస్కే షఫిక్, నర్సంపేట మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొంత రంజిత్, చెన్నారావుపేట మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి మంద నరేష్, ఖానాపూర్ మండల యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి బొల్లం హరీష్, యూత్ కాంగ్రెస్ నాయకులు గద్ద అఖిల్, మహమ్మద్ సల్మాన్, దేశి సాయి పటేల్, మచ్చకంటి మనోజ్ కుమార్, మంచాల హరీష్, గద్ద నిఖిల్, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.

