Breaking News

ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రజలు సహకరించాలి.

నల్లబెల్లి ఎస్ఐ గోవర్ధన్

మన ప్రగతి న్యూస్/నల్లబెల్లి

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..

మండల ప్రజలు గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా మద్యం నిల్వ, అమ్మకాలు చేయకూడదని.. బెల్ట్ షాప్స్ నడపవద్దని ఎస్సై గోవర్ధన్ సూచించారు. సోషల్ మీడియాలో ఎలాంటి రెచ్చగొట్టే వాఖ్యలు, శాంతి భద్రతలకు విఘాతo కలిగించే చర్యలకు దిగవద్దని చెప్పారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఎమ్మార్వో ముందు బైండోవర్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికలు సజావుగా జరిగేటట్లు అందరూ సహకరించాలని కోరారు.