ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సమక్షంలో 25 కుటుంబాలు కాంగ్రెస్లో చేరిక
మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
స్థానిక ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎత్తున ఆ పార్టీ నాయకులు జలకిస్తున్నారు. బుధవారం జనగామ జిల్లా దేవరుప్పుల మండలంలో సీత్య తండాలో స్థానిక ఎన్నికల వేళ రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. బుధవారం సీత్య తండా గ్రామానికి చెందిన 25 మంది బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆ పార్టీకి రాజీనామా చేసి మండల పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు ఆధ్వర్యంలో పాలకుర్తి మండల కేంద్రంలో గల ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే మామిడాల యశస్విని రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. చేరిన వారికీ ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. పార్టీలో చేరిన వారు మాట్లాడుతూ గ్రామంలో అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, యువత కోసం అవకాశాల కల్పనలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కృషి తమను ఆకట్టుకుందని, నియోజకవర్గంలో ఎమ్మెల్యేయశస్విని రెడ్డి చేపడుతున్న అభివృద్ధి పనులకు ఆకర్షితులమై బిఆర్ఎస్ను విడిచి కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నామని తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ సీత్య తండా నుంచి 25 మంది కార్యకర్తలు కాంగ్రెస్లో చేరడం ఎన్నికల శుభ సూచకమని గ్రామ అభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తామని. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విశ్వాసం పెంచుకోవడం ఇదే నిదర్శనమని అన్నారు.సీత్య తండాలో కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని సూచించారు. సందర్భంగా మండల పార్టీ అధ్యక్షుడు నల్ల శ్రీరాములు మాట్లాడుతూ మండలంలోని అన్ని గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు.

