Breaking News

కారు ఢీ కొని.. జర్నలిస్టు సుంకర రాజు దుర్మరణం..

మన ప్రగతి న్యూస్/విశాఖపట్నం:

విశాఖపట్నం, దక్షిణ నియోజకవర్గం..రామా టాకీస్ అంబేద్కర్ భవన్ పరిసరాల్లో బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పాత్రికేయుడు సుంకర రాజు మృతి చెందారు. రోడ్డు దాటుతున్న సమయంలో గుర్తు తెలియని కారు వెనుక నుంచి ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఢీ కొట్టడంతో రాజు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. రాజ్‌ న్యూస్, పబ్లిక్ స్పీచ్‌ తదితర ప్రచార విభాగాల్లో పాత్రికేయుడిగా రాజు సేవలందిం చారు. ఘటన పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన కారు ఆచూకీ కోసం గాలింపులు సాగుతున్నాయని తెలిపారు.

రెండు నెలల శిశువు మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి