మండలంలో తొలిబోణి కొట్టిన కాంగ్రెస్ పార్టీ
మన ప్రగతి న్యూస్ / దమ్మపేట :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, దమ్మపేట మండలం, అల్లిపల్లి గ్రామపంచాయతీ సర్పంచి పదవి కాంగ్రెస్ పార్టీకి ఏకగ్రీవము అయింది. జిల్లాలోని ఉత్తమ గ్రామ పంచాయతీగా గుర్తింపు లభించిన సంగతి తెలిసిందే. గ్రామపంచాయతీ ఎన్నికలలో అల్లిపల్లి గ్రామానికి చెందిన జమ్ముల రమేష్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలబడగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అనుచరుడు ఆలపాటి రామచంద్ర ప్రసాద్ తన రాజకీయ చతురతో గ్రామ పంచాయితీ సర్పంచ్ పదవి ఏకగ్రీవం అవటానికి ఎంతో కృషి చేశారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆయనను అభినందించారు.

