మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలను శినివారం పాలకుర్తి మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ మండల ఇన్చార్జి రామచందర్ మాదిగ ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు చెరుపల్లి యాదగిరి స్వామి మాదిగ పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గణపురం భాస్కర్ గాదపాక రవికుమార్, గాదపాక కరుణాకర్, గాదపాక సోమన్న, గాయాల నాగరాజు, చెర్పెల్లి అశోక్, చెరుపల్లి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.

