మనప్రగతిన్యూస్/పాలకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:
కొడకండ్ల మండల కేంద్రానికి చెందిన రాపోలు, చెరుకు బిక్షం ఇటీవల మృతి చెందగా,ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, టి పి సి సి ఉపాధ్యక్షురాలు హనుమండ్ల ఝాన్సీ రాజేందర్ రెడ్డి ఆదేశాల మేరకు శనివారం మండల పార్టీ అధ్యక్షుడు ధారావత్ సురేష్ నాయక్ తో పాటు మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు మృతురాలు సత్తమ్మ ఫోటోకు పూలమాలలు వేసి, కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం అందించారు.ఈ కార్యక్రమంలో కొడకండ్ల టౌన్ అధ్యక్షులు మసురం రవిందర్,మాజీ ఎంపీటీసీ అందే యాకయ్య ఎస్టిసెల్ ఉపాధ్యక్షులు రాయపురం ఉప్పలయ్య,యూత్ నాయకులు,గఫూర్, పల్లె అనిల్,సీనియర్ నాయకులు నర్మెట ఉపేందర్,కోటరాజు,కోట మల్లి కార్జున్,నాయిని కనకయ్య,అందే రవి తదితరులు పాల్గొన్నారు.

