Breaking News

క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక ద్రుఢత్వం లభిస్తుంది.

మనప్రగతి న్యూస్/ వేములవాడ:

రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆదివారం రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో మొదటి రాష్ట్ర స్థాయి ఓపెన్ కుంగ్ పూ చాంపియన్షిప్ పోటీలను ప్రారంభించారు. ఆటలు ఆడటం వల్ల శారీరక దృఢత్వం, మానసిక ఉల్లాసం లభిస్తాయని, విద్యార్థులు కరాటే కుంఫు పోటీలలో రాణించాలని ఆయన కోరారు. జీవితంలో వచ్చే ఆటుపోట్లను ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలను క్రీడలు పెంపొందిస్తాయని తెలిపారు. క్రీడాకారులకు ఎల్లప్పుడూ తన సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో క్రీడా యూనివర్సిటీ ఏర్పాటు, సీఎం కప్ నిర్వహణ వంటి క్రీడాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి పెద్దపీట వేస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కి వినతి పత్రం అందజేత..