మన ప్రగతి న్యూస్/ ఏన్కూర్:
ఖమ్మం జిల్లా ఏనుకూరు మండలం గాయత్రి హాస్పిటల్ వైద్యులు డాక్టర్ కొలిశెట్టి నరేష్, డాక్టర్ కొలిశెట్టి రమేష్ ప్రసన్నల కుమార్తె చిన్నారి ఆద్యవేద రమణి పుట్టు వెంట్రుకల వేడుక గురువారం ఘనంగా జరిగింది.ఈ వేడుకకు వైరా ఎమ్మెల్యే రాందాస్ నాయక్, జిల్లా కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, సొసైటీ చైర్మన్ శెట్టిపల్లి వెంకటేశ్వరరావు, మార్కెట్ చైర్మన్ లచ్చిరాం నాయక్, మండల అధ్యక్షుడు స్వర్ణ నరేందర్, మాజీ చైర్మన్ లాలూ నాయక్, గుడ్ల వెంకటేశ్వరరావు, నల్లమల శివకుమార్, స్వర్ణ ప్రహల్లాదరావు, జాగర్లమూడి రంజిత్ తదితరులు హాజరై చిన్నారిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

